Wednesday, December 21, 2016

                                                ఆయ‌న ఇంట్లో ఎంత దొరికిందో తెలుసా..?



చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంటిపై జ‌రిగిన ఐటీ దాడుల్లో ఎంత బంగారు .. ఎంత కొత్త క‌రెన్సీ దొరికిందో తెలుసా ..  చెన్నై  అన్నానగర్‌ లోని ఆయన నివాసంతోపాటు మరో ఆరు చోట్ల దాడులు జ‌రిగిన విష‌యం తెల్సిందే క‌దా. ఈ దాడుల్లో  18 లక్షల కొత్త నోట్లు .. 2 కేజీల బంగారం లభించినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. రామ్మోహనరావు కొడుకు .. స‌మీప‌ బంధువుల ఇళ్లలో ఈ మొత్తం లభించినట్టు సమాచారం.
టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్ళు .. కార్యాలయాలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. అక్కడ లభించిన పత్రాల్లో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు కనిపించడంతో ఐటీ అధికారులు త‌మ దృష్టిని చీఫ్ సెక్రేట‌రీపైకి మ‌ళ్ళించారు. ఈ నేపథ్యంలో రామ్మోహ‌న్ రావుకు సమన్లు జారీ చేసి ఈ ఐటీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. 
Tags: IT Rides on Tamilnadu Chief Secretary Rammohan Rao House 

http://www.newspillar.com/post/it-rides-on-tamilnadu-chief-secretary-rammohan-rao-house

No comments:

Post a Comment