Friday, December 23, 2016

                                             255 పార్టీలను రద్దు చేసిన ఎన్నికల కమిషన్

ఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలుగా ఉంటూ ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్న పార్టీలకు ఖటిఫ్ చెప్పింది. దేశ వ్యాప్తంగా 255 రాజకీయపార్టీల గుర్తింపును రద్దు చేస్తూ సిఈసీ ప్రకటన విడుదల చేసింది. 2005 నుంచి 2015 మధ్య కాలంలో ఏ ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 12 పార్టీలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ స్థాపించిన ‘అన్నా తెలుగుదేశం’ పార్టీతో పాటు.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్థాపించిన ‘ఎన్టీఆర్ తెలుగు దేశం’ పార్టీ కూడా ఉంది. ఈ రెండు పార్టీలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని సీఈసీ రద్దు చేసిన పార్టీలు ఇలా ఉన్నాయి... * ఆల్ ఇండియా సద్గుణ పార్టీ * ఆంధ్రనాడు పార్టీ * అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ) * బహుజన రిపబ్లికన్ పార్టీ * భారతీయ సేవాదళ్ * జై తెలంగాణ పార్టీ * ముదిరాజ్ రాష్ట్రీయ సమితి * నేషనల్ సిటిజన్స్ పార్టీ * ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి) * సత్యయుగ్ పార్టీ * తెలంగాణ కాంగ్రెస్ పార్టీ * తెలంగాణ ప్రజా పార్టీ .

Tags: central election commission cancelled some political party recognition, cec, anna tdp. ntr tdp, political partys .

http://www.newspillar.com/post/central-election-commission-cancelled-some-political-party-recognition

No comments:

Post a Comment