Tuesday, December 27, 2016

                                              డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎటు పోయాయి..!

హైదరాబాద్ : ఎన్నికల్లో మీరు కట్టిస్తానన్న డబుల్ బెడ్ ఇండ్లు ఎటు పోయాయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే డీకే అరుణ. అసెంబ్లీలో గృహ నిర్మాణంపై జరిగిన చర్చలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలోని పేదల గృహా నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఎర్రవల్లి, నర్సన్నపేట్ లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టిన సర్కార్ కు .. మిగతా నియోజకవర్గాలు కనబడటం లేదా అని నిలదీశారు. సీఎం, కేటీఆర్,హరీష్ ల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులను పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల బకాయిలను ఎందుకు ప్రభుత్వం చెల్లించడం లేదని ప్రశ్నించిన డీకే అరుణ.. గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వేసిన సిబిసిఐడి రిపోర్ట్ ఎక్కడికెళ్ళిందని అన్నారు. ఈ సందర్బంగా టీఆరెస్ ఎమ్మెల్యే లు అడ్డు తగలడంపై డీకే మండిపడ్డారు. సభలో కూడా షి టీమ్స్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని చురకలు ఆంటించారు. 

Tags: dk aruna in assembly on double bedrooms debate, dk aruna, mla, assembly, speaker, indhiramma housing 

http://www.newspillar.com/post/dk-aruna--in-assembly-on-double-bedrooms-debate

No comments:

Post a Comment